హిమజ్యోతి మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందీ భాషపై ఉచిత శిక్షణ
విశాఖపట్నం: కూడా అంతర్జాతీయ హిందీ భాష దినోత్సవం జనవరి 10ను పురస్కరించుకొని హిమజ్యోతి మినిస్ట్రీస్ ట్రస్ట్ వారు విద్యార్థులకు సులభ శైలిలో హిందీ భాషలో మాట్లాడే విధంగా ఆన్లైన్లో మూడు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి కే.హిమశ్రీ తెలియజేశారు. ప్రతి విద్యార్థి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తరగతులు జనవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించబడును. మిగిలిన వివరములకు 9010314089 నెంబర్ లో సంప్రదించి, పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయబడునని నిర్వాహకులు తెలిపారు.