చికెన్, మటన్ తినే వారికి అలర్ట్
ఇండియన్ కౌన్సిల్ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇటీవల చేసిన సంయుక్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కోళ్లు, మేకలు, రొయ్యలు, చేపల పెంపకంలో యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగినట్లు గుర్తించారు. దేశంలో 10 రాష్ట్రాల నుంచి శాంపిళ్లను వారు సేకరించారు. కోళ్లలోనే ఎక్కువ శాతం యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.