జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ విజేత గాజువాక

జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ విజేత గాజువాక...విజేత లకు భహుమతులు ప్రధానం...



మహారాణిపేట మార్చ్ 23: విశాఖ జర్నలిస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శనివారము తో ముగిసింది. ఆంధ్ర మెడికల్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ పోటీల్లో గాజువాక జట్టు విన్నర్ గా నిలిచింది.. ఆతిధ్య జట్టు రన్నర్ కప్ ను దక్కించుకొంది. ముగింపు వేడుకలు కి సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు ముఖ్య అతిధి గా హోజరై విజేతలు కి ట్రోఫీ లు అందచేశారు..



ఈ సందర్భంగా గంట్ల  శ్రీనుబాబు మాట్లాడుతూ. నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి. క్రీడా పోటీలు వల్ల. శారీరక దేహదారుడ్్యం మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నారు. ఎప్పటికప్పుడు పరవాడ గాజువాక గోపాలపట్నం. పెందుర్తి విశాఖపట్నంలో ఈ టోర్నల్ నిర్వహించడం వల్ల. అనేకమందికి ఆడే అవకాశం కలుగుతుంది అన్నారు. జర్నలిస్టులకు. తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ. గత కొద్ది రోజులుగా తాను అనేక టోర్నమెంట్లు నిర్వహించాను అన్నారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ ద్వారా మెగా టోర్నమెంట్ నిర్వహించేందుకు. ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామకృష్ణ. కార్యదర్శి అనిల్. పలువురు సభ్యులు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు బ్యాటింగ్ చేసి శ్రీనుబాబు క్రీడాకారులను ఉత్సాహపరిచారు.