స్థానికులకు అవకాశం ఇవ్వండి... అభివృద్ధి దిశగా అడుగులేస్తా..

భీమిలి నియోజకవర్గం నుంచి శాసన సభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఈ నెల 19 వ తేదీన 11 గంటలకు నామినేషన్ దాఖలాలు చేయునునట్టు స్థానిక స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి శ్రీ రామనవమి సందర్భంగా ఈ రోజు తెలియజేశారు. 



తగరపువలస కూడలి మొదలుకొని భీమిలి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయనున్నాను అని తెలియజేస్తూ ఈ తరుణంలో స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన నా ప్రజా పరిచయం కార్యక్రమం అంటే నాలుగున్నర నెలల ప్రయాణంలో మన భీమిలి ప్రజలు అందరూ నన్ను ఎంతగానో ఆదరించారు, అని చెప్పటం లో అతిశయోక్తి లేదు అని తెలియజేశారు. అంతే కాకుండా మన భీమిలి ప్రజలు నా నామినేషన్ రోజు నుండి మరింత ఎక్కువగా నన్ను ఆశీర్వదించి మరియు ఆదరించాలని కోరుతూ అంతే కాకుండా తేది: 13.05.2024 న జరిగే పోలింగ్ న అత్యధిక మెజారిటీతో విజయం దిశగా నన్ను ప్రజలకు దగ్గర చెయ్యాలని స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి కి మీ అమూల్య మైన ఓటు వేసి గెలిపించ వలసిందిగా స్థానికులకు అవకాశం ఇవ్వండి యువతను ఉత్తేజ పరచండి కొత్త వాళ్ళు రాజకీయ్యలోకి రావాలి అని ఆమె పేర్కొన్నారు.