ఐపీఎస్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాజీవ్ రతన్ కన్నుమూత
హైదరాబాద్: ఉగాది పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషా దం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో మంగళ వారం ఆయన మృతి చెందారు. కాగా, 1991వ ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్.. ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డీజీగా పని చేస్తున్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు...