ఆరోగ్య శ్రీ సేవలపై సీఎస్‎తో ముగిసిన భేటీ..

ఆరోగ్య శ్రీ సేవలపై సీఎస్‎తో ముగిసిన భేటీ.. సేవలు పునఃప్రారంభం ఎప్పుడంటే..



నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రమేష్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిశారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే విడదల చేయాలని కోరారు. హాస్పిటల్స్‌ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎస్‌కు వివరించారు డాక్టర్‌ రమేష్‌. ఆరోగ్యశ్రీ సేవల పునరుద్దరణపై ఇవాళో, రేపో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆరోగ్య శ్రీ సేవలు అమలు చేయడం కోసం ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని నెట్ వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. దీనిపై గతంలో ఈసీ స్పందించింది. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తే ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ప్రస్తుతం సేవలు తీసుకుని చికిత్స పొందుతూ ఉన్న వారిని మినహాయించాయి ఆసుపత్రులు. కొత్తగా వచ్చే వారికి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. దీంతో సీఎస్ నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ను ఈరోజు భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై వెలువడే నిర్ణయం కోసం చాలా మంది చికిత్స తీసుకునే వారిలో ఉత్కంఠ నెలకొంది. అలాగే కొత్తగా సేవలను వినియోగించుకునే వారు కూడా ఒక స్పష్టమైన సమాచారం కోసం ఎదురు చేస్తున్నారు.