నూతన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడి కి శుభాకాంక్షలు కొండి శెట్టి సురేష్ బాబు ...............
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ కు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయుచున్న నారా చంద్రబాబు నాయుడు కి కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు. బుదవారం ఏపీ కి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నారా చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు అభినందనలు కూటమి ప్రభుత్వానికి అభినందనలు శుభాకాంక్షలు, అని జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండి శెట్టి సురేష్ బాబు ప్రకటనలో తెలియజేశారు ప్రజలు మీకు ఇచ్చిన ఘన విజయాన్ని , ప్రజలు మీపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి మీ విజయం ప్రతిబింభం అన్నారు. ప్రజల కలలను సాకారం చేయడంలో మీ పూర్తి పదవీకాలంతో పూర్తి చేయాలని కోరారు. బలమైన, ప్రకాశవంతమైన భారతదేశాన్ని / రాష్ట్రాన్ని నిర్మించడంలో మీరు ఈ విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామీణ వైద్యుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. గ్రామాలలో, పట్టణాలలో, మురికివాడల్లో నివసించు పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రాథమిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న గ్రామీణ వైద్యులకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. భారతదేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ముఖ్య మంత్రి ప్రత్యేక చొరవ చూపి గ్రామీణ వైద్యుల సమస్యలకు శాశ్విత పరిష్కారం చూపాలని వివరించారు. వృత్తి భద్రత కల్పించాలన్నారు. సబ్సిడీతో రుణాలు, ఉచిత బస్సు పాసులు, ఉచిత ఇల్లు, పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయిన పారా మెడిక్స్ శిక్షణను తిరిగి ప్రారంభించి గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించి అర్హత సర్టిఫికెట్లు మంజూరు చేయాలన్నారు. అర్హత సర్టిఫికెట్ల ఆధారంగా గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్సలు చేయుటకు అనుమతులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ వైద్యులపై దాడులు నివారించాలని వివరించారు. నూతన ముఖ్య మంత్రి రాష్ట్రం లో ఉన్న గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు ఒక సమగ్రమైన చట్టాన్ని ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తారన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. త్వరలోనే గ్రామీణ వైద్యుల సమస్యలను నూతన ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు తెలిపారు.