అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎ ఐ ఎస్ ఎప్, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎప్ ఐ.
అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు. నీట్ పరీక్షను రద్దు చేయాలని గురువారం దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపు. ఎన్ టి ఏ సంస్థను రద్దు చేయాలి. నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలి. ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాడేరు లోని అన్ని విద్యాసంస్థలు బంద్ విజయవంతం చేసిన విద్యార్థులు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామ రాజు జిల్లా, పాడేరులో విద్యార్థులు విద్యాసంస్థల బంద్ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కే. రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి జీవాన్ కృష్ణ, రాష్ట్ర నాయకులు చిన్నారావు విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నిట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలలో ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానము ప్రవేశపెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని తెలిపారు. నీట్ పరీక్షను నిర్వహించిన ఎన్ టి ఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేటువంటి పద్ధతులలో పేపర్ లీకేజీలు చేస్తున్న ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టిఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు పి రాజు చిన్నాబాబు మల్లేష్ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.