ఏసీబీకి చిక్కిన ఎస్సై, జర్నలిస్ట్

 మెదక్ జిల్లా

అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఎస్సై!! 


జర్నలిజం ముసుగులో దందాలకు పాల్పడుతున్న విలేకరు.


 లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏ.సీ.బీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు. ఈ మేరకు స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను విడిచి పెట్టడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు. బిక్కనూర్ కు చెందిన మెట్రో ఈవినింగ్ జర్నలిస్టు మస్తాన్ మధ్యవర్తి గా ఉన్నాడు. బాధితుడి పిర్యాదు మేరకు ఏ.సీ.బీ అధికారులు లంచం తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.