ఏసీబీకి చిక్కిన కలెక్టర్

ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి. 



ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్. భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు. నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో కొనసాగుతున్న అధికారుల తనిఖీలు. బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసీబీ. బాధితుడు నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి.