ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తాం.. ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు సాయం..
గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపలేదు...కేంద్రం ఇచ్చిన నిధులనూ పక్కదారి పట్టించింది. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు. గృహ నిర్మాణం, పర్యాటక రంగాలపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు.
అమరావతి :
• రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై గట్టిగా ఫోకస్ పెట్టాలి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తాం.
• రాష్ట్రంలో పీఎంఏవై-అర్బన్, పీఎంఏవై-రూరల్, పీఎం జన్మన్, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ లో కలిపి 9,11,594 ఇళ్లు పెండింగులో ఉన్నాయి. 5,74,710 ఇళ్ల నిర్మాణం అసలు చేపట్టలేదు..ఇవి పూర్తి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. ప్రభుత్వాలు మారినా పథకాలు మార్చితే లబ్ధిదారులు ఇబ్బంది పడతారు.
• గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించింది. సెంటు స్థలం పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆవ భూములు, మునిగిపోయే చోట పేదలకు స్థలాలు ఇచ్చారు. వాటిని చదును చేసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. తక్కవ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించారు.
• 25 లక్షల ఇళ్లు కడతానని గొప్పగా చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే చేపట్టారు. పెండింగులో ఉన్న ఇళ్లను పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.
• అర్బన్ హౌసింగ్ కు మన ప్రభుత్వ హయాంలో రూ.2.5 లక్షలు అందించాం. అందులో రూ.లక్ష రాష్ట్రం, రూ.1.5 లక్షలు కేంద్రం అందించింది.
• ఏజన్సీ ప్రాంతాల్లో తప్ప అన్ని ప్రాంతాల్లో అర్బన్ హౌసింగ్ కవర్ అయింది. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.50, రూ.75 వేలు అందించాం.
• గత ప్రభుత్వం అనర్హులకు ఇల్లు కేటాయిస్తే ఇస్తే చర్యలు తీసుకోండి. 2004-14 వరకు కూడా ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయి.
• పెండింగులో ఉన్న 9,11,594 ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు అందించే రూ.2.5 లక్షలను రూ.1.80 లక్షలకు తగ్గించింది. కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు మాత్రమే ఇచ్చింది.
• 5,74,710 ఇళ్లు ప్రారంభించలేదు. ఈ లెక్కలు కేంద్రానికి చేరితే మళ్లీ నిధులు రావు. ఈ విషయం లబ్ధిదారులకు వివరించి ఇంటి నిర్మాణం చేపట్టేలా కృషి చేయాలి. కేంద్రం దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు లబ్ధిదారుకు అందిస్తాం.
• మన ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వబోతోంది. 2014-19 మధ్య మంజూరై నిర్మాణ దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేస్తాం.
• ఎన్టీఆర్ రూరల్ హౌస్ లో ఇచ్చిన ఇళ్లు కూడా రికార్డు చేయాలి...వాటికి గత ప్రభుత్వం నిధులు నిలిపేసింది. ఆ లబ్ధిదారులకు కూడా నిధులు చెల్లిస్తాం.
• కొందరు పాలకుల వల్ల ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.
• నీరు - చెట్టు, NREGSలో పెండింగులో ఉన్న బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తాం.
• ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన రూ.3,183 కోట్లను గత ప్రభుత్వం మళ్లించింది. రూ.500 కోట్లు గ్రామీణ హౌసింగ్ నుండి మళ్లించారు. నిధులు మళ్లించినందుకు కేంద్రం రాష్ట్రంపై రూ.28 కోట్లు ఫైన్ కూడా వేసింది.
• రూ.8 వేల కోట్లు కేంద్ర నుండి రాకుండా చేశారు. 5 వేల కోట్లు కార్పొరేషన్లకు రావాల్సిన ఫండ్స్ రాకుండా చేశారు.
• పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చు. ఏపీకి ఉన్న అవకాశాలు ఏ రాష్ట్రానికి లేవు.
• రాష్ట్రంలో మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. గండికోట ఒక చారిత్రాత్మక ప్రదేశం. అరకు కూడా ఆహ్లాదకరమైన ప్రాంతం. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంలో నెంబర్ వన్ గా ఉంది. పీపీపీ మోడల్ లో అభివృద్ధి చేసేందకు చర్యలు తీసుకోవాలి.
• శ్రీశైలంలో టెంపుల, వాటర్ ప్రాజెక్టు, టైగర్ రేంజ్ ప్రాంతం కావడంతో అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి.
• ఐటీసీ, నోవోటెల్, మిగతా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అమరావతికి కూడా స్టార్ హోటల్స్ రావాల్సి ఉంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పీపీపీ మోడల్ లో ప్రమోట్ చేయాలి.
• రాష్ట్రంలో 10 పోర్టులు, 10 ఎయిర్ పోర్టులు ఉన్నాయి..కొద్దిగా శ్రద్ధ పెడితే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయి.