గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి - ఎస్ ఐ సైదులు

గణేష్ నవరాత్రి ఉత్సవాల వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.



నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని గుండాల మండలం పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ ఐ సైదులు సూచనలు చేశారు. మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా 7వ తేదీలోపు పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ సందర్భంగా ఎస్సై సైదులు మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఇందుకోసం ముందుగా నిర్వాహకులు తాము ఏర్పాటు చేసి గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ https:// police portal. tspolice. gov. in ద్వారా ఏర్పాటు నిర్వాహకులు పూర్తి వివరాలు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి .దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్ లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు .గణేష్ మండపాలను ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి . అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి.ఏదైనా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వాటర్ ఇసుక లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా తక్కువ కాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి .సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ డీజే లను ఏర్పాటు చేయకూడదని తెలిపారు.