ఇరిగేషన్ డి ఈ పై అగ్రహం వ్యక్తం చేస్తున్న గుమ్మడవల్లి గ్రామస్తులు...
ఇరిగేషన్ అధికారుల వైఫల్యం ప్రాజెక్టుకు శాపంగా నిలిచిందంటూ గ్రామస్తులు ఆవేదన....
ప్రాజెక్టు లోతట్టు అక్రమణాలు ఆపాలి...ఏం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, పెద్దవాకు ప్రాజెక్టు లోతట్టు అక్రమణాలు నివారించాలని డిమాండ్ చేస్తూ, ప్రాజెక్టు నిర్మాణానికి సాగుభూములు ఇచ్చిన గుమ్మడవల్లి రైతులు ఆదివారం ఉదయం రోడ్డుపై బటాయించి ఆందోళన చేపట్టారు. లోతట్టులో ఉన్న 1200 ఎకరాలు ఎకరాల్లో సుమారుగా 1000 ఎకరాలు పైగా భూమిని చదును చేసి, సాగు చేసేందుకు దుక్కులు దున్ని సిద్ధం చేశారు. లోతట్టు మొత్తం ఆక్రమించుకోవడంతో పెద్దవాగు ప్రాజెక్టులో నీరు నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందని, దీంతో ఆయకట్టు రైతులకు సాగునీరు పూర్తిస్థాయిలో లభించదని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, లోతట్టు అక్రమణాలు తొలగించెంత వరకు ఆందోళన వ్యక్తం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.