ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలు వస్తున్నాయ్!

 


భారత వాతావరణ శాఖ ( IMD) ప్రకారం.. కొమొరిన్ ఏరియా.. అంటే.. దక్షిణ భారత దేశంపై అల్పపీడనం ఉంది. ఇది భూమి నుంచి 5.8 వరకు మేఘాలను కలిగివుంది. అంటే.. ఇది చాలా పెద్దది కింద లెక్క. దీనికి సరైన గాలులు తోడైతే.. మేఘాలు మరింత పెరిగి.. తుపానుగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ.. ప్రస్తుతం గాలుల దిశ ఒకే విధంగా లేదు. అందువల్ల ఇది తుపాను అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో ఓ భారీ అల్పపీడనం ఉంది. ఇది భారత్‌కి నైరుతీ దిశలో మాల్దీవులు , లక్షద్వీప్ దగ్గరలో ఉంది. దాని ప్రభావం తమిళనాడు , కర్ణాటక , కేరళ , లక్షద్వీప్‌తోపాటూ.. మన ఏపీ , తెలంగాణపై కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వానలు పడవు. కానీ.. భయంకరమైన సుడిగాలు రాబోతున్నాయి. ఆ వివరాలను చూద్దాం. ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం.. ఏపీ , తెలంగాణలో ఉదయం నుంచి భారీ సుడిగాలులు.. మేఘాలను మోసం చేస్తాయి. ఇవి రోజంతా ఉంటాయి. మేఘాలు కూడా రోజంతా పరుగులు పెడుతూ ఉంటాయి. మేఘాలు కొన్ని ప్రాంతాల ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఐతే.. విపరీతమైన గాలులు.. కొంత ఉపశమనం కలిగిస్తాయి. గురువారం బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 17 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ గాలులతో జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ జ్వరం ఉన్నవారు.. ఈ గాలి తగలకుండా చూసుకోవాలి. ఇవి భయంకర గాలులు. ఇవి అరేబియా సముద్రం నుంచి రెండు రాష్ట్రాలకు వస్తున్నాయి. వీటిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు , జ్వరం వచ్చేలా చేయగలదు. ఉష్ణోగ్రతలు చూస్తే.. బంగాళాఖాతంలో గురువారం 28 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. ఏపీలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. తెలంగాణలో 36 నుంచి 39 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ముఖ్యంగా ఆదిాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్ కూడా ఉండే ఛాన్స్ ఏర్పడింది. అంటే మనం గురువారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. తప్పనిసరై వెళ్లాల్సి వస్తే.. నీరు , పండ్ల రసాలు తాగుతూ.. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. తేమ రెండు రాష్ట్రాల్లో 35 శాతం ఉంది. మేఘాలు బాగా వస్తే.. తేమ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కారు , బస్సు వంటి వాహనాల్లో ప్రయాణాలు చేసేవారికి గురువారం బాగుంటుంది. ఐతే.. టూవీలర్లపై వెళ్లే వారికి మాత్రం ఎండ ప్రభావం పడుతుంది. వారు అక్కడక్కడ చెట్ల నీడలో ఆగుతూ వెళ్లడం మేలు. ఒక మంచి విషయం ఏంటంటే.. ఈ సంవత్సరం వర్షాలు నార్మల్‌గా పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. గత సంవత్సరం లాగానే.. నైరుతీ రుతుపవనాలు టైం ప్రకారం కేరళకు రావచ్చని అంటున్నారు. ఐతే దానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈ మూడు నెలల్లో ఎండలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఇవి అయిపోయిన తర్వాతే మనకు ఉపశమనం ఉంటుంది.