విరోచనం సాఫీగా అవ్వడం లేదా ?ఆయుర్వేదం లో వైద్య నిలయం సలహాలు
1. విరేచనం (దొడ్డికి) సాఫీగా అవ్వదా ? మలబద్ధకం (కాన్స్టిపేషన్).
2. మలవిసర్జనకు (దొడ్డికి) వెళుతున్నప్పుడు రక్తం కూడా పడుతుందా ? ఆర్శమొలలు (ఫైల్స్ / హెమరాయిడ్స్)
3. మలద్వారపు చర్మం వద్ద కోసుకుపోయినట్లుగా చెలిక ఏర్పడిందా ? గుదవిదారం (ఫిషర్)
4. మలద్వారం వద్ద నొప్పితో కూడిన గడ్డ తయారయిందా ? విస్పోట (పెరియానల్ యాబ్సిస్)
5. తరచుగా విరేచనాలవుతుంటాయా ? అతిసారం (డయేరియా)
6. మలద్వారంలో నొప్పి అప్పుడప్పుడూ వస్తూ తగ్గిపోతూ ఉంటుందా ? పెద్దపేగుల్లో సంచులవంటి నిర్మాణాలు తయారవడం (డైవర్టిక్యులైటిస్)
7. ఆర్శమొలలు లేకపోయినప్పటికీ మలద్వారం నుంచి రక్తం కారుతుందా ? పేగుల్లో తిత్తివంటి నిర్మాణాలు తయారవడం (పాలిప్స్)
8. ఒకవేళ మీరు మహిళ అయితే - మీ రుతుక్రమంలో అస్తవ్యస్తత చోటు చేసుకుందా ? భార్యాభర్తల కలయిన తరువాత నొప్పిగా ఉంటుందా ? స్త్రీ సంబంధ వ్యాధులు (గైనకాలజికల్ డిసీజెస్)
9. ఆకలి మందగించడంతో పాటు, వాంతి వచ్చినట్లు ఉండటం, జ్వరంగా ఉండటం సంభవిస్తున్నాయా ? ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి (ఎపెండిసైటిస్)
10. మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మలద్వారంలో నొప్పి వస్తూ ఉంటుందా ? మానసిక ఆందోళన (ప్రాక్టాల్జియా ఫ్యూగాక్స్)
11. మీరు మగవారైతే - మూత్ర నాళం నుంచి వివిధ రకాల ద్రవ పదార్థాలు స్రవిస్తున్నాయా ? ప్రోస్టేట్ గ్రంథి వాపు (ప్రోస్టటైటిస్)
12. మలద్వారం నుంచి అపరిమితంగా రక్తం స్రవిస్తుందా ?
పేగుల క్యాన్సర్ మలద్వారంలో నొప్పి ఉన్నప్పుడు కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో నరాలు వ్యాపించి ఉండటం, మనం రోజు మొత్తం మీద ఎక్కువ సేపు కూర్చొనే ఉండటం వంటి కారణాల చేత ఈ ప్రాంతంలో ఏ మాత్రం అసౌకర్యం కలిగినా అది తీవ్రమైన చిరాకుకు, అసహనానికి, ఇబ్బందికి దారి తీస్తుంది. తేలికపాటి కారణాల నుంచి గంభీరమైన హేతువుల వరకూ ఎన్నో రకాల అంశాలు మలద్వారంలో నొప్పిని కలిగిస్తాయి. కనుక వీటన్నిటి గురించి ఆలోచించడం అవసరం.
1. మలబద్దకం(కాన్ స్టిపేషన్): మలబద్దకం అనేది మలద్వారంలో నొప్పికి ఒక ప్రధానమైన కారణం. పురీషనాళాన్ని (రెక్టమ్) చేరిన మలం ఒకవేళ ఎక్కువసేపు నిలువ ఉంటే దాన్నుంచి నీరంతా శోషింపబడి మలం మరింత గట్టిగా తయారవుతుంది. ఫలితంగా మలద్వారం పైన ఒత్తిడి ఏర్పడి నొప్పి మొదలవుతుంది. ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తినడం, సమృద్ధిగా నీళ్ళు తాగటం, రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చెంచాడు నెయ్యి కలుపుకుని తాగటం, ప్రతిరోజూ ఉదయం పూట మూడు నాలుగు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగటం, పొట్టమీద ఒత్తిడి పడేలా మసాజ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న ఉపాయాలతో మలబద్దకాన్నీ , తద్వారా మలద్వారంలో నొప్పినీ తగ్గించుకోవచ్చు.
గృహచికిత్సలు:
1. కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా అంతే భాగం ఉప్పు కలిపి రాత్రి పడుకునేముందు తీసుకోవాలి.
2. రేలపండు గుజ్జును చెంచాడు మోతాదుగా రెండు చెంచాలు చక్కెర కలిపి గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి.
3. రోజూ కనీసం పావుకిలో నల్ల ద్రాక్షపండ్లను తినాలి, తాజా పండ్లు దొరకని పక్షంలో ఎందు ద్రాక్షలను 24 గంటలు నీళ్లలో నానేసి నీళ్ళతో సహా తీసుకోవాలి.
4. వస కొమ్ము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం వేరు, పిప్పళ్ళు, అతివస, చెంగల్వ కోష్ఠు, యావక్షారం వీటిని సమభాగాలు తీసుకొని అన్నిటిని పొడిచేసుకొని నిలవచేసుకోవాలి. నిలవచేసుకోవాలి. ఈ పొడిని అరచెంచాడు మోతాదుగా రాత్రిపూట పడుకునేముందు తీసుకోవాలి.
5. అతసీతైలం (లిన్సీడ్ ఆయిల్) భోజనానికి ముందు చెంచాడు పరిమాణంలో నీళ్లతో కలిపి తీసుకుంటే మలం హెచ్చుమొత్తాల్లో మృదువుగా విసర్జితమౌతుంది.
ఔషధాలు :-
త్రిఫలా చూర్ణం, లశునాదివటి, అభయారిష్టం, వైశ్వానర చూర్ణం, మాణిభద్రలేహ్యం, పంచనకారచూర్ణం, ఏరండపాకం.
2. అర్శమొలలు(ఫైల్స్ /హెమరాయిడ్స్) : మలంతో పాటు రక్తం కూడా కనిపిస్తుంటే అది అర్శమొలలకు సూచన.
అర్శమొలలనేవి రక్తనాళాలు - ముఖ్యంగా సిరలు - మలద్వారం ప్రాంతంలో గట్టిపడి మెలికలు తిరగటం వలన ఏర్పడుతాయి. మలబద్దకం వంటి కారణాల చేత మలద్వారం వద్ద ఒత్తిడి ఏర్పడితే, అది సిరలపైన ప్రతిఫలించి, సిరల గోడలు చిట్లి రక్తస్రావానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీని ఫలితంగా మలద్వారం వద్ద నొప్పి, అసౌకర్యం, దురద వంటి లక్షణాలు కలుగుతాయి. అలాగే, చేతికి బొడిపె వంటి ఆకారం తగిలే అవకాశం వుంది. పోతే, ఎక్కువ సంఖ్యలో విరేచనాలవుతున్నప్పుడు కూడా ఈ అర్శమొలల మీద ఒత్తిడి పడి, చీరుకుపోయి, నొప్పి, రక్తస్రావాలూ కలిపించే అవకాశం వుంది. అర్శమొలల నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు రక్తం ఎర్రటి ఎరుపుతో తాజాగా కనిపిస్తుంది. అలాగే మలంతో కలిసి కాకుండా మలం చుట్టూ చారికలా కనిపిస్తుంది. ఇలా కాకుండా ఒకవేళ రక్తం మలంతో కలగాపులగంగా కలిసిపోయి ఒకింత నలుపు రంగులో కనిపిస్తుంటే దానిని పేగుల నుంచి ఏర్పడిన రక్తంగా అనుమానించాలి. శత్రువులా బాధిస్తుంది కనుక మొలలకు అర్శస్సు అనే పేరు వచ్చింది. ('అరి' అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం.)
వైద్యనిలయం చికిత్సలు :
1. వాము, శొంఠి సమతూకంగా తీసుకొని పొడిచేయాలి. దీనిని అరచెందాడు మోతాదుగా గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
2. కరక్కాయల నుంచి గింజలను తొలగించి కేవలం పెచ్చులు మాత్రమే గ్రహించి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెందాడు చొప్పున రెట్టింపు భాగం బెల్లంతో కలిపి మూడు పూటలా తీసుకోవాలి.
3. ఉత్తరేణి గింజలను రెండు చెంచాలు పొడి చేసి బియ్యపు కడుగు నీళ్ళతో తీసుకుంటే రక్తం ఆగిపోతుంది.
4. నాగకేశర చూర్ణం (చెంచాడు), పంచదార (2 చెంచాలు),
3. గుదవిదారం(ఫిషర్): మలద్వారపు చర్మం చీరుకుపోయినప్పుడు దానిని గుదవిదారం (ఫిషర్) అంటారు. ఇది మలబద్దకం వల్లగాని, ఇన్ఫెక్షన్ల వల్లగాని ఏర్పడుతుంది. మామూలుగా పెదవులు, చేతివేళ్లు, మోచేతులు తదితర భాగాల పైనుండే చర్మం దళసరిగా, గట్టిగా, పొడిగా తయారైనప్పుడు ఎలా అయితే చీరుకుపోతుందో అలాగే, మలద్వారపు చర్మం కూడా చీరుకుపోయే అవకాశం ఉంది.
మలబద్దకాన్ని తగ్గించడం ఈ స్థితిలో మొదటి చికిత్సా సూత్రం.
వ్రణరోపన ఔషధాలను ప్రయోగించడం రెండవ సూత్రం.
ఔషధాలు : అభయారిష్టం, అవిపత్తికర చూర్ణం, ద్రాక్షాది రసాయనం, ద్రాక్షారిష్టం, సుకుమార రసాయనం, వైశ్వానర చూర్ణం, మాణిభద్ర లేహ్యం. బాహ్యప్రయోగాలు - వ్రణరోపణ తైలం, శతధౌతఘృతం.
4. విస్పోట(పెరియానిల్ యాబ్సిస్) : కొంతమందికి మలద్వారం వద్ద నొప్పితో కూడిన గడ్డలు తరచుగా తయారవుతుంటాయి. వైద్య పరిభాషలో పెరియానల్ యాబ్సిస్ గా పిలువబడే ఈ గడ్డలు ఎక్కువగా వెంట్రుకల కుదుళ్లు ఇన్ ఫెక్ట్ అవ్వడం చేతనూ, వాటి మొదళ్లు అడ్డగించబడటం చేతనూ వస్తుంటాయి.
వైద్య నిలయం చికిత్సలు :
1. రేగు ఆకులను ముద్దగా నూరి ఉడకబెట్టి పైకి వట్టు వేయాలి.
2. రణపాల ఆకును వేడిచేసి పైకి కట్టాలి.
ఔషధాలు : శారిబాద్యారిష్టం, గంధక రసాయనం, కర్పూర శిలాజిత్తు.
5. అతిసారం(డయేరియా): తరచుగా విరేచనాలయ్యేవారిలో మలద్వారం ఒరుసుకుపోయి నొప్పి ఏర్పడే అవకాశం ఉంది. విరేచనాలు సాధారణంగా ఆహారం కలుషితం కావడం చేతకాని, పెద్ద పేగులు వ్యాధిగ్రస్తమవడం వల్లగాని, మోతాదుకు మించి విరేచ నౌషధాలను తీసుకోవడం వల్లగాని ఏర్పడతాయి. ఇలా జరుగుతున్నప్పుడు కారణాలను కనిపెట్టి దానికి అనుగుణమైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
6. పెద్దపేగుల్లో సంచులవంటి నిర్మాణాలు తయారవడం ( డైవర్టిక్యులైటిస్): మలద్వారంలో నొప్పి దానంతట అదే వస్తూ తిరిగి తగ్గిపోతూ ఉంటే పెద్ద పేగుకు సంబంధించిన *_డైవర్టిక్యులైటిస్_* అనే స్థితి గురించి ఆలోచించాలి. వయసు మీద పడుతున్న కొద్ది పెద్ద పేగు కండరాలు శక్తి తగ్గిపోయి చిన్న చిన్న సంచుల మాదిరి నిర్మాణాలు తయారవుతాయి. వీటిల్లో మలం చేరి గట్టిపడి ఇన్ఫెక్షన్ కు గురై మలద్వారం వద్ద నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధిలో పేగుల కండర శక్తిని పెంచి, మలనివారణను సజావుగా జరిపించే మందులను వాడాలి.
ఔషధాలు: అగస్త్యహరీతకీలేహ్యం, పంచామృతపర్పటి, మహాగంధక రసం, రసపర్పటి, స్వర్ణపర్పటి.
7. పేగుల్లో తిత్తివంటి నిర్మాణాలు తయారవడం(పాలిప్స్) : అర్శమొలలు లేకపోయినప్పటికీ ఒకవేళ మలద్వారం నుంచి రక్తం కారుతున్నట్లయితే పాలిప్స్ గురించి ఆలోచించాలి. పాలిప్స్ అనేవి శరీరపు ఖాళీ ప్రదేశాల్లో తయారవుతుంటాయి. ఇవి కాండం కలిగి, రక్తంతో నిండి ఉండే తిత్తి వంటి నిర్మాణాలు. ఇవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్లగాని లేదా ఒత్తిడికి గురై గీరుకు పోవడం వల్లగాని రక్తస్రావమై మలద్వారం నుంచి బహిర్గతమవుతుంది. కుటజఘనవటి, సంజీవనీవటి, బాహ్యప్రయోగం - కాసీసాదితైలం.
7. స్త్రీ సంబంధ వ్యాధులు (గైనకలాజికల్ డిసీజెస్) : మహిళల్లో మలద్వారం వద్ద నొప్పికి స్థానిక కారణాలే కాకుండా ఇతర అంశాలు కూడా కారణమవుతాయి. అండాశయానికి చెందిన ఓవేరియస్ సిస్టులు గాని కటివలయానికి చెందినా పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ వ్యాధులు గాని మలద్వారంలో నొప్పి రూపంలో వ్యక్తమవుతుంటాయి. దీనిని వైద్యశాస్త్ర పరిభాషలో రిఫర్డ్ పెయిన్ అంటారు. ఈ సమస్యలకు, ఆయా కారణాల మీద దృష్టి సారించడం అవసరం.
వైద్య నిలయం చికిత్సలు:
1. వస చూర్ణాన్ని పూటకు 3 గ్రాము మోతాదుగా మూడుపూటలా తేనెతో తీసుకోవాలి.
2. అత్తిచెట్టు పట్టను కాని, దానిమ్మ చెట్టు వేరు బెరడునుగాని, కషాయం కాచో యోనిని శుభ్రం చేసుకోవాలి. దీనిని డూష్ అంటారు.
3. తులసి ఆకులను, వేపాకులను వెడల్పాటి గంగాళంలో మరిగించాలి. ఈ నీళ్ళతో కాళ్ళు బైటపెట్టి బొడ్డుమునిగేలా ఇరవై నిమిషాలు కూర్చోవాలి, ఇలా రోజుకు మూడు సార్లు వారం రోజుల పాటు చేయాలి.
4. త్రిఫలాచూర్ణం (ఒక చెంచా), గుడూచిసత్వం (అరచెంచా) రెండుకలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు మూడుసార్లు చూప్పున కనీసం రెండు నెలల పాటు పుచ్చుకోవాలి.
8. ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి(ఎపెండిసైటిస్) : జ్వరంతో పాటు ఆకలి తగ్గిపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం అనేవి ఎపెండిసైటిస్ ను సూచిస్తాయి. ఎపెండిక్స్ అనేది ఉదర ప్రాంతంలో కుడివైపున క్రిందిభాగంలో అమరివున్నఒక ఆంత్రావశేషం. ఇది కొంతమందిలో పెద్దపేగు వెనుకగా అమరి వుంటుంది. అలాంటి వారికి ఒకవేళ ఎపెండిసైటిస్ వస్తే అది మలద్వారంలోకి నొప్పి రూపంలో ప్రసరిస్తుంది.
ఔషధాలు :ఆరోగ్యవర్ధినీవటి, పునర్నవారిష్టం, దశామూలారిష్టం, లవణభాస్కర చూర్ణం, శంఖభస్మం, కపర్థికాభస్మం, స్వర్జికాక్షారం, అగ్నితుంటివటి, ఆహిఫేనాదివటి, కర్పూరాదివటి, బృహత్ వాత చింతామణి రసం, పునర్నవాదిమండూరం., శంఖవటి, శూలహరణ యోగం.
9. మానసిక ఆందోళన (ప్రాక్టాల్జియా ఫ్యూగాక్స్):
కొంతమందికి మానసికంగా ఒత్తిడికి లోనయినప్పుడు మలద్వారంలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి నిద్రనుంచి మేలుకొలుపగలిగేటంత ఎక్కువస్థాయిలో కూడా ఉండవచ్చు. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని ప్రాక్టాల్ జియా, ఫ్యూగాక్స్ అంటారు. ఒత్తిడికి లోనయినప్పుడు కండరాలు అనూహ్యంగా ముడుచుకుపోవటం వలన ఈ తరహా నొప్పి వస్తుంది. ధ్యానం, ఇతర రిలాక్సేషన్ విధానాలతో పాటు అశ్వగంధా, బ్రాహ్మీ వంటి మూలికలు ఇందులో ఔషధాలు:
నారసింహ ఘృతం,
బ్రాహ్మీ ఘృతం
గోరోచనాది గుటిక,
కళ్యాణక ఘృతం,
క్షీరబలా తైలం,
అశ్వగందారిష్టం,
సర్పగంధా చూర్ణం,
స్వర్ణముక్తాది గుటిక.
బాహ్యప్రయోగం - బ్రాహ్మీతైలం.